Janasena MLA Viral Video: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. రైల్వేకోడూరు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ చేసిన గంభీర ఆరోపణలతో వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాల్లో పంచుకోవడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మహిళ వాదన ప్రకారం, 2024 జూన్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె అభినందనలు చెప్పడానికి ఫేస్బుక్ సందేశం పంపింది. అక్కడి నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్లు, టెలిగ్రామ్ చాట్లు మొదలయ్యాయి. తన వ్యక్తిగత జీవితం, భర్తతో విభేదాలు, పిల్లల వివరాలు కూడా ఎమ్మెల్యే తెలుసుకున్నారని ఆమె చెప్పారు. “నువ్వు ఒంటరిగా లేవు” అంటూ భరోసా ఇచ్చారని ఆమె ఆరోపించింది.
కొన్ని రోజుల తర్వాత విషయం మరింత తీవ్రమైంది. దుస్తులు లేకుండా వీడియో కాల్స్ చేయమని ఒత్తిడి చేశారని, నిరాకరించగా ఉద్యోగంకు భంగం వస్తుందని, కుమారుడి భద్రతకు ముప్పు వస్తుందని బెదిరించారని మహిళ తెలిపింది. 2024 జూలైలో రాజంపేట సమీపంలోని ఒంటరి ప్రదేశంలో కలవాలని బలవంతం చేసి, కారులో శారీరక దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బయటపెడితే కుటుంబాన్ని నాశనం చేస్తానని భయపెట్టారని చెప్పారు.

ఈ సంఘటన తర్వాత గర్భం దాల్చానని, ఎమ్మెల్యే ఒత్తిడి చేసి అబార్షన్ చేయించుకోవాలని చెప్పారని మహిళ ఆరోపించింది. పెళ్లి చేస్తానని నమ్మించి ఐదుసార్లు అబార్షన్లు జరిగాయని, భర్తకు ఫోన్ చేసి విడాకులు ఇవ్వమని బెదిరించడంతో కుటుంబం దూరమైందని ఆమె బాధ వ్యక్తం చేసింది. కుమారుడు కూడా తన వద్ద లేకుండా పోయాడని ఆవేదన చెప్పారు.

ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే తల్లి ప్రమీల స్పందించారు. తన కుమారుడు అమాయకుడని, ఆ మహిళే కుటుంబాన్ని వేధిస్తోందని చెప్పారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులు ఈ వీడియోను డీప్ఫేక్ అంటూ ఖండిస్తున్నారు. అరవ శ్రీధర్ కూడా వీడియో విడుదల చేసి, ఫేక్ ఆరోపణలని, న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో నిజం ఏమిటో విచారణ పూర్తయ్యే వరకు తెలియదు.
Disclaimer
ఈ ఆర్టికల్ పూర్తిగా ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తా చానెల్స్లో, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాయబడింది. ఇందులో ప్రస్తావించబడిన ఆరోపణలు, ప్రతిస్పందనలు, వాదనలు ఏవీ మా స్వంత (teluguinsight.com) అభిప్రాయాలు కావు లేదా ధృవీకరించబడినవి కావు.
ఇది కేవలం వార్తాపరమైన సమాచారం మాత్రమే. రాజకీయ పక్షపాతం లేకుండా, ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా వ్యతిరేకించడం లేకుండా, ప్రజలకు అందుబాటులో ఉన్న వివరాలను నిష్పక్షపాతంగా అందిస్తున్నాము.
ఈ విషయంలో నిజమైన వాస్తవాలు ఏమిటో, ఆరోపణలు నిజమా లేక కుట్రా అనేది పోలీసు లేదా న్యాయస్థాన విచారణ పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది. అందువల్ల ఈ సమాచారాన్ని కేవలం వార్తాంశంగా మాత్రమే పరిగణించాలి. ఎటువంటి నిర్ణయాత్మక తీర్పు ఇవ్వడానికి లేదా ఎవరినీ నిందించడానికి ఈ ఆర్టికల్ ఉద్దేశపడలేదు.
పాఠకులు ఈ విషయంపై స్వతంత్రంగా ఆలోచించి, అధికారిక వర్తమానాలు, న్యాయపరమైన పరిణామాల కోసం వేచి చూడాలని కోరుతున్నాము.