--Advertisement--

Revanth Reddy Education Reform: తెలంగాణలో 10వ తరగతి పరీక్షల రద్దుపై కీలక ప్రకటన

Revanth Reddy 10th Exams: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చివేయాలని ఆయన భావించారు.

ఇకపై పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. నర్సరీ నుంచి పన్నెండవ తరగతి వరకు ఒకే విద్యా విధానం అమలు చేయనున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన అధ్యయనాలను పరిగణలోకి తీసుకొని ఈ మార్పులు తీసుకురాబోతున్నారు.

Advertisement

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తుంది. ఇంటర్మీడియట్ స్థాయిలోనే బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని సీఎం ఆశిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న +2 విధానంతో సమానంగా ఉంటుంది.

ఇది లాగా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా సీఎం స్పందించారు. ప్రభుత్వం సరైన ప్రక్రియ ప్రకారమే ముందుకు సాగుతుందని తెలిపారు. విచారణ పూర్తి చేయకుండా ఎవరినీ అరెస్ట్ చేయలేమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిందని, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఇప్పటికే సస్పెండ్ చేశామని చెప్పారు. ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నామని, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని అసత్య ప్రచారం అని తిరస్కరించారు.

కేబినెట్ విస్తరణ విషయంలో కూడా సీఎం మాట్లాడారు. ఊహాగానాలు వద్దని స్పష్టం చేశారు. ప్రతి ఢిల్లీ పర్యటనకు ఇది కారణం కాదని అన్నారు. అజారుద్దీన్‌కు MLC ఇవ్వడానికి సమయం ఉందని, గవర్నర్ విషయం సుప్రీం కోర్టు సూచనల ప్రకారం తేలుస్తామని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ నియామకం కూడా తగిన సమయంలో జరుగుతుందని చెప్పారు.

About the Author
Vesly Kumar CH

Vesly Kumar CH is a content writer covering business news, government welfare schemes, and daily news updates. He focuses on delivering clear, accurate, and timely information based on verified sources and official announcements. At Telugu Insight, Vesly contributes to regular news coverage with a focus on practical and reader-friendly reporting.

View all posts →
Telegram Group Join Now
WhatsApp Group Join Now