EPS Pension Minimum Pension: ఉద్యోగుల పెన్షన్ పథకంలో చాలా కాలంగా ఒక ముఖ్యమైన డిమాండ్ నడుస్తోంది. కనీస పెన్షన్ మొత్తం రూ.1000 నుంచి రూ.7500కి పెంచాలని ఉద్యోగులు, పెన్షనర్లు గట్టిగా కోరుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత మొత్తం సరిపోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా లోక్సభలో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన పెన్షనర్లకు నెలకు రూ.1000 కనీస పెన్షన్ అందిస్తోందని చెప్పారు.

అయితే పెన్షన్ ఫండ్ స్థిరత్వాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఏదైనా మార్పు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పెంపు ప్రతిపాదన ప్రస్తుతం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం EPS ఫండ్కు అదనంగా 1.16 శాతం వేతన సహకారం అందిస్తోందని కూడా తెలిపారు.
ఇక అధిక పెన్షన్ పొందడం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు EPFO కొత్త ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. దీని ద్వారా జాయింట్ ఆప్షన్ అప్లికేషన్లు సులభంగా సమర్పించవచ్చు. బేసిక్ శాలరీ రూ.15,000 లోపు ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్లో చేరవచ్చు.
వీరు తమ పీఎఫ్ ఖాతాకు 12 శాతం కంట్రిబ్యూట్ చేస్తారు. అందులో 8.33 శాతం పెన్షన్ ఫండ్కు వెళ్తుంది. కంపెనీ కూడా సమానంగా ఇస్తుంది. ఈ విధంగా పెన్షన్ నిర్ణయమవుతుంది.
ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా వెల్లడించింది. పెన్షనర్లు ఈ తాజా సమాచారాన్ని గమనించి తదుపరి చర్యలు తీసుకోవాలి.
Note: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏ ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి.